ఎక్కువ మందికి లబ్ధి చేకూర్చండి: ఎమ్మెల్యే
ABN , First Publish Date - 2021-06-12T04:55:03+05:30 IST
ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అమలవుతున్న పథకాల్లో ఎక్కువ మందికి లబ్ధి చేకూరేలా శ్రద్ధ తీసుకోవాలని అందోలు ఎమ్మెల్యే క్రాంతికిరణ్ అధికారులను ఆదేశించారు.
జోగిపేట, జూన్ 11: ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అమలవుతున్న పథకాల్లో ఎక్కువ మందికి లబ్ధి చేకూరేలా శ్రద్ధ తీసుకోవాలని అందోలు ఎమ్మెల్యే క్రాంతికిరణ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని మండలాలకు కేటాయించిన యూనిట్లపై ఎస్సీ కార్పొరేషన్ అధికారులు, ఎంపీడీవోలతో సమీక్ష నిర్వహించారు. ఆర్థిక సంవత్సరంలో ఎక్కువ మందికి లబ్ధి చేకూరేలా యూనిట్లను పెంచాలని సూచించారు. పథకాలపై దళిత యువతకు అవగాహన కల్పించి, లబ్ధి పొందేలా చూడాలన్నారు. సమీక్షలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ బాబూరావు, అందోలు ఎంపీడీవో సత్యనారాయణ పాల్గొన్నారు.