నవరత్నాలతో ప్రతి ఒక్కరికీ మేలు: ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి
ABN , First Publish Date - 2021-08-13T13:50:38+05:30 IST
ప్రభుత్వం అందిస్తున్న నవరత్నాలతో..
పిడుగురాళ్ల: ప్రభుత్వం అందిస్తున్న నవరత్నాలతో ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరుతుందని ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి తెలిపారు. గురువారం స్థానిక మార్కెట్ యార్డు సమీపంలోని కల్యాణమండపంలో మేర సంఘీయుల అత్మీయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 135 ఉపకులాలకు లబ్ధిచేకూర్చే విధంగా ప్రభుత్వం కార్పొరేషన్లను ఏర్పాటు చేసిందన్నారు. ప్రతి పథకం ద్వారా రాష్ట్రంలో లక్షలాది మంది లబ్ధిపొందుతున్నారని వివరించారు. అతిరాస-మేర సంఘ కార్పొరేషన్ చైర్మన్ ఇళ్ల భాస్కరరావు మాట్లాడుతూ ఐదారు ఉపకులాలు కలిపి కార్పొరేషన్ ఏర్పాటు చేసి నవరత్నాలతో ప్రతి ఒక్కరికి లబ్ధిపొందుతున్నారని, బీసీ కులాలను గతంలో ఓటు బ్యాంకుగానే ఉపయోగించుకోవటం జరిగిందే తప్ప ఎటువంటి లబ్ధిచేకూరలేదన్నారు. జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలోనే ప్రతి కార్పొరేషన్ ద్వారా ప్రతి కులానికి ఉపయోగం కలుగుతుందని వివరించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ కొత్త వెంకటసుబ్బారావు, మార్కెట్ యార్డు చైర్మన్ ఎండీ గఫార్, ముడేల వెంకటేశ్వరరెడ్డి, మాజీ జడ్పీటీసీ రామిరెడ్డి, చింతా రామారావు, కార్పొరేషన్ డైరెక్టర్ యనుముల రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.