నాణ్యతతోనే చే‘నేత’లకు లాభాలు

ABN , First Publish Date - 2021-06-19T05:12:30+05:30 IST

నేత వస్ర్తాలు నాణ్యతతో కూడుకుంటేనే లాభాలు వస్తాయని ఎమ్మెల్యే రోజా పేర్కొన్నారు. ఆమె శుక్రవారం నగరిలో అహ్మదాబాద్‌ నుంచి తెప్పించిన మరమగ్గాల పనితీరును పరిశీలించారు.

నాణ్యతతోనే చే‘నేత’లకు లాభాలు
అత్యాధునిక మరమగ్గాన్ని పరిశీలిస్తున్న ఎమ్మెల్యే రోజా

- ఎమ్మెల్యే రోజా


పుత్తూరు, జూన్‌ 18: నేత  నాణ్యతతో కూడుకుంటేనే లాభాలు వస్తాయని ఎమ్మెల్యే రోజా పేర్కొన్నారు. ఆమె శుక్రవారం నగరిలో అహ్మదాబాద్‌ నుంచి తెప్పించిన మరమగ్గాల పనితీరును పరిశీలించారు. ఎలా పని చేస్తున్నాయని కార్మికులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మరమగ్గాలపై తయారయ్యే దుస్తులు నాణ్యత కలిగి ఉంటాయన్నారు. మరి కొంత కాలం బేరీజు వేసి సత్ఫలితాలు వస్తే కార్మికులందరికీ ఈ యంత్రాలను అందిస్తామన్నారు. అనంతరం సీఎం సహాయనిధి కింద మంజూరైన 55 చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. అలాగే పాత ప్రభుత్వ ఆసుపత్రి భవనం వద్ద 80 లక్షల తో నిర్మించనున్న వెల్‌నెస్‌ భవన నిర్మాణానికి  భూమి పూజ చేశారు, ఈ కార్యక్రమంలో సెల్వమణి, మున్సిపల్‌ చైర్మన్‌ నీలమేఘం, నాయకులు చంద్రారెడ్డి, బాబురెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-06-19T05:12:30+05:30 IST