మంచిర్యాల: సుమన్కు బెంగాల్ ఎంపీ ప్రతిమ ఫోన్
ABN , First Publish Date - 2020-03-29T15:18:49+05:30 IST
తెలంగాణ ప్రభుత్వ విప్ సుమన్కు బెంగాల్ ఎంపీ ప్రతిమామండల్ ఫోన్ చేశారు.
మంచిర్యాల: తెలంగాణ ప్రభుత్వ విప్ సుమన్కు బెంగాల్ ఎంపీ ప్రతిమామండల్ ఫోన్ చేశారు. తెలంగాణలో లాక్డౌన్ నేపథ్యంలో మంచిర్యాలలో ఇబ్బంది పడుతున్న...బెంగాల్ కూలీలను ఆదుకోవాలని ఎంపీ విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన సుమన్.. డీసీపీ ఉదయ్తో మాట్లాడారు. సుమన్ సూచనతో 36 మంది బెంగాల్ కూలీలను డీసీపీ కలిశారు. తమ వద్ద పైసా లేదని, భోజనానికి ఇబ్బంది పడుతున్నామని బెంగాల్ కూలీలు వెల్లడించడంతో.. నిత్యావసర సరుకులు అందిస్తామని డీసీపీ వారికి హామీ ఇచ్చారు. సుమన్ సానుకూల స్పందన పట్ల ఎంపీ ప్రతిమామండల్ హర్షం వ్యక్తం చేశారు.