ప్రియుడిపై కాల్పులు జరిపిన girl friend

ABN , First Publish Date - 2021-12-17T13:13:44+05:30 IST

తమ మధ్య దూరం పెరుగుతుందనే కారణంతో ప్రియుడిపై ప్రియురాలు కాల్పులు జరిపిన ఘటన...

ప్రియుడిపై కాల్పులు జరిపిన girl friend

కోల్‌కతా(పశ్చిమబెంగాల్): తమ మధ్య దూరం పెరుగుతుందనే కారణంతో ప్రియుడిపై ప్రియురాలు కాల్పులు జరిపిన ఘటన పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో జరిగింది. కత్వా పోలీస్ స్టేషన్ పరిధిలోని కేషియా గ్రామంలో ఈ కాల్పుల ఘటన జరిగింది.పుర్బా బర్ధమాన్ జిల్లాలో 22 ఏళ్ల మహిళ 22 ఏళ్ల యువకుడిని గత కొంతకాలంగా ప్రేమిస్తోంది. ఇటీవల తన సంబంధంలో దూరం పెరుగుతుందని భావించిన ప్రియురాలు ఆ యువకుడికి ముద్దుపెట్టి, అతనితో కలిసి సిగరెట్ తాగిన తర్వాత అతనిపై కాల్పులు జరిపింది.యువతి కాల్పులు జరిపినపుడు ఓ వ్యక్తి ముందస్తుగా హెచ్చరించడంతో యువకుడు తప్పించుకున్నాడు. బుల్లెట్ యువకుడి పొత్తికడుపు పక్కనుంచి వెళ్లింది. 


తన ప్రియురాలు జార్ఖండ్ నుంచి ఇంటికి తిరిగి వచ్చి సర్కస్ మైదానంలో కలవాలని కోరగా వెళితే, తనపై కాల్పులు జరిపిందని యువకుడు ఫిర్యాదు చేశారు. కాల్పులు జరిపిన యువతి పరారైంది.పోలీసులు నిందితురాలిని తర్వాత అరెస్టు చేసి, ఆమె వద్ద నుంచి తుపాకీ, కాట్రిడ్జ్‌లను స్వాధీనం చేసుకున్నారు.  గత కొన్ని నెలలుగా ఇద్దరి మధ్య దూరం పెరగడం వల్లే ఈ సంఘటన జరిగిందని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.


Updated Date - 2021-12-17T13:13:44+05:30 IST