బెంగళూరులోనే కరోనా కేసులు అధికం
ABN , First Publish Date - 2021-08-04T16:20:14+05:30 IST
రాజధాని బెంగళూరులో కొవిడ్ కేసులు క్రమేపీ పెరుగుతున్నాయి. రాష్ట్ర ఆరోగ్యశాఖ మంగళవారం విడుదల చేసిన బులెటిన్ ప్రకారం 24 గంటల అవధిలో బెంగళూరు నగరంలో కొత్తగా 477 పాజిటివ్ కేసులు
బెంగళూరు: రాజధాని బెంగళూరులో కొవిడ్ కేసులు క్రమేపీ పెరుగుతున్నాయి. రాష్ట్ర ఆరోగ్యశాఖ మంగళవారం విడుదల చేసిన బులెటిన్ ప్రకారం 24 గంటల అవధిలో బెంగళూరు నగరంలో కొత్తగా 477 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తర్వాతి స్థానంలో దక్షిణకన్నడ జిల్లా లో 307, మైసూరులో 147, ఉడుపిలో 104, హాసన్లో 104లలో పాజిటివ్ కే సులు నమోదయ్యాయి. రాష్ట్రంలో 1,674 మందికి పాజిటివ్ నమోదు కాగా 1,376 మంది కోలుకున్నారు. 38మంది మృతిచెందారు. ఇప్పటికీ రాష్ట్రవ్యాప్తం గా 24,280 యాక్టివ్ కేసులు ఉండగా బెంగళూరులో 8,986 కేసులు ఉన్నాయి.