అనుమానంతో భార్యను చంపిన భర్త

ABN , First Publish Date - 2020-08-07T11:18:56+05:30 IST

భార్యపై అనుమానంతో కత్తితో ఆమె గొంతు కోసి చంపిన కసాయి భర్త ఉదంతం కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు నగరంలో జరిగింది.....

అనుమానంతో భార్యను చంపిన భర్త

బెంగళూరు (కర్ణాటక): భార్యపై అనుమానంతో కత్తితో ఆమె గొంతు కోసి చంపిన కసాయి భర్త ఉదంతం కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు నగరంలో జరిగింది. బెంగళూరు నగరంలోని వికాస్ ఎంక్లేవ్ కు చెందిన కలీం షరీఫ్, నజ్నీన్ లు భార్యాభర్తలు. భార్య నజ్నీన్ మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందనే అనుమానంతో భర్త కలీం షరీఫ్ తరచూ గొడవపడే వాడు. బన్నేర్ ఘట్ట మసీదుకు వచ్చి పరస్పర అంగీకారంతో భార్య భర్తలిద్దరూ విడాకులు తీసుకున్నారు. అనంతరం ఇంటికి తిరిగివచ్చాక భార్యభర్తల మధ్య గొడవ జరిగింది. దీంతో భర్త కలీం షరీఫ్ వంటగదిలో నుంచి కత్తి తీసుకువచ్చి భార్య గొంతు కోసి హతమార్చాడు. భార్యను హత్య చేసిన కలీంషరీఫ్ ను అరెస్టు చేశామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని డీసీపీ హరీష్ పాండే చెప్పారు. 

Updated Date - 2020-08-07T11:18:56+05:30 IST