ఆరిపాక ప్రసాద్‌కు ఉత్తమ లఘు చిత్ర కథా నాయకుడి అవార్డు

ABN , First Publish Date - 2021-12-08T05:17:34+05:30 IST

మండలంలోని మలునాయుడుపాలేనికి చెందిన నటుడు, నవలా రచయిత ఆరిపాక ప్రసాద్‌ అతికిన బతుకులు లఘు చిత్రానికి ఉత్తమ కథా నాయకుడు అవార్డును అందుకున్నారు.

ఆరిపాక ప్రసాద్‌కు ఉత్తమ లఘు చిత్ర కథా నాయకుడి అవార్డు
ఆరిపాక ప్రసాద్‌ను సత్కరిస్తున్న ఎస్వీ సుబ్బారెడ్డి ఫౌండేషన్‌ సభ్యులు

సబ్బవరం, డిసెంబరు 7: మండలంలోని మలునాయుడుపాలేనికి చెందిన నటుడు, నవలా రచయిత ఆరిపాక ప్రసాద్‌ అతికిన బతుకులు లఘు చిత్రానికి ఉత్తమ కథా నాయకుడు అవార్డును అందుకున్నారు. విజయవాడలోని ఎస్వీ సుబ్బారెడ్డి ఫౌండేషన్‌ ఏటా నిర్వహించే జాతీయ లఘు చిత్ర పోటీల్లో విశాఖ జిల్లా నుంచి ఆరిపాక ప్రసాద్‌ ఎంపికయ్యారు. ఈ మేరకు సోమవారం విజయవాడలోని లక్ష్మీ ఫంక్షన్‌ హాల్‌లో జరిగిన 20వ జాతీయ స్థాయి సాంస్కృతిక మేళాలో భాగంగా పలు జిల్లాల విజేతలతో పాటు ప్రసాద్‌కు ఫౌండేషన్‌ సభ్యులు ప్రశంసాపత్రం, జ్ఞాపిక ఇచ్చి దుశ్శాలువాతో ఘనంగా సత్కరించారు. కాగా ఆయనను ప్రజాప్రతినిధులు, అధికారులు, వివిధ పార్టీల నాయకులు అభినందించారు.


Updated Date - 2021-12-08T05:17:34+05:30 IST