వ్యవధి పెరిగితే మెరుగైన ఫలితం
ABN , First Publish Date - 2021-01-17T07:52:12+05:30 IST
కొవిషీల్డ్ వ్యాక్సిన్ తొలి డోసుకు రెండో డోసుకు మధ్య వ్యవధి ఎంత ఎక్కువ గా ఉంటే ఫలితం అంత మెరుగ్గా ఉంటుందని సీరం ఇన్స్టిట్యూట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సురేశ్ జాదవ్ అన్నారు.
న్యూఢిల్లీ, జనవరి 16: కొవిషీల్డ్ వ్యాక్సిన్ తొలి డోసుకు రెండో డోసుకు మధ్య వ్యవధి ఎంత ఎక్కువ గా ఉంటే ఫలితం అంత మెరుగ్గా ఉంటుందని సీరం ఇన్స్టిట్యూట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సురేశ్ జాదవ్ అన్నారు.
మూడో దశ క్లినికల్ పరీక్షల్లో తాము 28 రోజుల వ్యవధితో రెండో డోసు ఇచ్చామని, అందుకే దాన్నే ప్రామాణికంగా నిర్ణయించామన్నారు. కానీ, ఆ వ్యవధి ఎంత ఎక్కువగా ఉంటే అంత మంచిదన్నారు.