గిరిజనులకు మెరుగైన వైద్యం అందించాలి

ABN , First Publish Date - 2021-01-21T06:24:56+05:30 IST

కంకణాపల్లి గ్రామ గిరిజనులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని గిరిజన సంఘం జిల్లా కమిటీ సభ్యుడు మంచాల శ్రీనివాసరావు కోరారు.

గిరిజనులకు మెరుగైన వైద్యం అందించాలి

పాచిపెంట: కంకణాపల్లి గ్రామ గిరిజనులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని గిరిజన సంఘం జిల్లా కమిటీ సభ్యుడు మంచాల శ్రీనివాసరావు కోరారు. ఆ గ్రామాన్ని పార్వతీపురం ఐటీడీఏ పీవో కూర్మనాథ్‌ సందర్శించిన సందర్భంగా గిరిజన సంఘ నాయకులు బాధిత కుటుంబాలను బుధవారం పరామర్శించారు. పారిశుధ్య కార్యక్రమం చేపట్టి కాలువలు నిర్మించాలని డిమాండ్‌ చేశారు. తాగునీటి కోసం చర్యలు చేపట్టాలన్నారు. పీవో ఆదేశించినా సంబంధిత అధికారులు పట్టించుకోలేదని ఆరోపించారు. ఈ పరామర్శలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు కోరాడ ఈశ్వరరావు, గిరిజన సంఘం నాయకులు పాల్గొన్నారు.

 

Updated Date - 2021-01-21T06:24:56+05:30 IST