బాధిత కుటుంబానికి ఆర్డీవో పరామర్శ
ABN , First Publish Date - 2021-12-01T03:46:56+05:30 IST
మండలంలోని వంగల్లుకి చెందిన తండ్రీకొడుకులు దువ్వూరు అలుగు దాటుతుండగా, కుమారుడు మృతి చెందాడు. బాధిత కుటుంబాన్ని ఆర్డీ
సంగం, నవంబరు 30: మండలంలోని వంగల్లుకి చెందిన తండ్రీకొడుకులు దువ్వూరు అలుగు దాటుతుండగా, కుమారుడు మృతి చెందాడు. బాధిత కుటుంబాన్ని ఆర్డీవో చైత్రవర్షిణ మంగళవారం పరామర్శించారు. అంత్యక్రియలకు ప్రభుత్వం తరుపున ఆర్థిక సహాయం అందచేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ పరంగా బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామని తెలిపారు. ఆమె తహసీల్దారు నిర్మలానందబాబా, మండల కన్వీనర్ పులగం శంకర్రెడ్డి, వీఆర్వో రవికుమార్, నాయకులు రఘురామయ్య, రఘునాథ్రెడ్డి తదితరులు ఉన్నారు.