భద్రాచలం దేవస్థానంలో లడ్డూలు మాయం

ABN , First Publish Date - 2021-09-07T23:35:30+05:30 IST

రాష్ట్రంలో ప్రఖ్యాతి చెందిన భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో

భద్రాచలం దేవస్థానంలో లడ్డూలు మాయం

భద్రాద్రి కొత్తగూడెం: రాష్ట్రంలో ప్రఖ్యాతి చెందిన భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో వెయ్యి లడ్డూలు మాయం అయ్యాయి. ఆలయ సూపరింటెండెంట్​ విచారణలో లడ్డూల గోల్‌మాల్‌ బయటపడింది. లడ్డూ కౌంటర్లో అమ్మిన లడ్డూలు, వచ్చిన ఆదాయం లెక్క తేలకపోవడంతో సూపరింటెండెంట్​ విచారణ జరిపారు. లడ్డూల మాయం ఘటనలో ఇద్దరు తాత్కాలిక ఉద్యోగులకు ఆలయ ఈఓ శివాజీ మెమోలు జారీ చేసారు. వారి నుంచి లడ్డూల రేటు ప్రకారం రూ.20 వేలను ఈఓ రికవరీ చేసారు. 

Updated Date - 2021-09-07T23:35:30+05:30 IST