ఆకలితో అలమటిస్తున్న విద్యార్థులు

ABN , First Publish Date - 2021-10-27T21:36:38+05:30 IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: నారంవారి గూడెం ప్రాథమిక పాఠశాల విద్యార్థులు ఆకలితో అలమటిస్తున్నారు.

ఆకలితో అలమటిస్తున్న విద్యార్థులు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: నారంవారి గూడెం ప్రాథమిక పాఠశాల విద్యార్థులు ఆకలితో అలమటిస్తున్నారు. మధ్యాహ్నం భోజనం పథకం ద్వారా అందాల్సిన భోజనం ఆలస్యంగా అందిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. విద్యార్థులు ఆకలితో వేచిఉండాల్సిన పరిస్థితి నెలకొంది. టీచర్.. మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకుల మధ్య వివాదం కారణంగా విద్యార్థుల కడుపుమాడ్చుతున్నారు.


సకాలంలో భోజనం అందించడంలేదని ప్రశ్నించినందుకు నిర్వాహకులు ఎదురుదాడి చేస్తున్నారని ఉపాధ్యాయురాలు చెబుతున్నారు. అయితే విద్యార్థులతో పాఠశాల ఆవరణ శుభ్రం చేయిస్తున్నట్లు టీచర్‌పై విమర్శలు ఉన్నాయి. ఇలా వారి మధ్య విద్యార్థులు నలిగిపోతున్నారు.

Updated Date - 2021-10-27T21:36:38+05:30 IST