భద్రాచలం దగ్గర గోదావరి ఉధృతి

ABN , First Publish Date - 2021-09-09T13:10:34+05:30 IST

గువన కురుస్తున్న భారీ వర్షాలకు భద్రాచలం దగ్గర గోదావరి ఉధృతి కొనసాగుతుంది. భద్రాచలం దగ్గర గోదావరి నీటిమట్టం 43 అడుగులకు చేరుకుంది

భద్రాచలం దగ్గర గోదావరి ఉధృతి

భద్రాద్రి కొత్తగూడెం: ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు భద్రాచలం దగ్గర గోదావరి ఉధృతి కొనసాగుతుంది. భద్రాచలం దగ్గర గోదావరి నీటిమట్టం తెల్లవారుజామున 43 అడుగులుగా ఉంది. దీంతో భద్రాచలం దగ్గర అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఇప్పటికే గోదావరి వరద రామాలయం స్నానఘట్టాల వరకు చేరింది. ప్రస్తుతం గోదావరి నీటిమట్టం 44.3 అడుగులకు చేరుకుంది. గోదావరి నీటిమట్టం మరింత పెరిగే అవకాశం ఉందని సీడబ్ల్యూసీ అధికారులు తెలిపారు.

Updated Date - 2021-09-09T13:10:34+05:30 IST