రూ.5.1కోట్లు పలికిన ‘భైరవ’..
ABN , First Publish Date - 2020-07-08T07:14:15+05:30 IST
ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు జగ్గీ వాసుదేవ్ కుంచె నుంచి జాలువారిన ప్రత్యేకమైన ఎద్దు పెయింటింగ్ ‘భైరవ’.. ఆన్లైన్ వేలం ద్వారా రూ.5.1కోట్లు సాధించింది. సద్గురుకు ఎంతో ఇష్టమైన ‘భైరవ’ అనే పేరు కలిగిన ఎద్దు గత ఏప్రిల్లో మృతి...
ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు జగ్గీ వాసుదేవ్ కుంచె నుంచి జాలువారిన ప్రత్యేకమైన ఎద్దు పెయింటింగ్ ‘భైరవ’.. ఆన్లైన్ వేలం ద్వారా రూ.5.1కోట్లు సాధించింది. సద్గురుకు ఎంతో ఇష్టమైన ‘భైరవ’ అనే పేరు కలిగిన ఎద్దు గత ఏప్రిల్లో మృతి చెందింది. దానికి నివాళిగా ఈ కళాకృతికి రూపం పోశారు. వేలం డబ్బులను ఇషా ద్వారా తమిళనాడులో కరోనా కట్టడికి వినియోగించనున్నారు.
- కోయంబత్తూర్