రుయా ఆస్పత్రి ఘటన ఘోర తప్పిదం: భానుప్రకాష్‌రెడ్డి

ABN , First Publish Date - 2021-05-12T20:40:37+05:30 IST

రుయా ఆస్పత్రి ఘటనపై బీజేపీ నేతలు ఆర్డీవోను కలిసి ఫిర్యాదు చేశారు.

రుయా ఆస్పత్రి ఘటన ఘోర తప్పిదం: భానుప్రకాష్‌రెడ్డి

తిరుపతి: రుయా ఆస్పత్రి ఘటనపై బీజేపీ నేతలు ఆర్డీవోను కలిసి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్‌రెడ్డి మాట్లాడుతూ రుయా ఆస్పత్రి ఘటన ఘోర తప్పిదమని అన్నారు. జిల్లా యంత్రాంగం ఏం చేస్తోందని ప్రశ్నించారు. మృతుల వివరాలు చెప్పడంలో నిర్లక్ష్యం కనిపిస్తోందని విమర్శించారు. అధికారులు ఎవరి మెప్పు కోసం లెక్కల్ని దాస్తున్నారని మండిపడ్డారు. ఘటన జరిగి రెండు రోజులు గడుస్తున్నా ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల పరిహారం ఇవ్వాలని భానుప్రకాష్‌రెడ్డి డిమాండ్ చేశారు. 

Updated Date - 2021-05-12T20:40:37+05:30 IST