కోవిడ్ ఉచిత వ్యాక్సిన్ల కోసం కేంద్రం ఎంత ఖర్చు చేసిందంటే?
ABN , First Publish Date - 2021-12-18T01:39:57+05:30 IST
ఒమైక్రాన్ కారణంగా ఇప్పటివరకూ మరణాలు సంభవించలేదన్నారు.
న్యూఢిల్లీ: కోవిడ్ ఉచిత వ్యాక్సిన్ల కోసం కేంద్రం ఈ నెల 9 వరకూ 19,675 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. కేంద్ర ఆరోగ్యశాఖ సహాయమంత్రి భారతీ పవార్ లోక్సభలో లిఖితపూర్వక సమాధానమిచ్చారు. భారత్లో నిర్వహిస్తోన్న ఆర్టీపీసీఆర్ పరీక్షలు ఒమైక్రాన్ను కనుగొనగలుగుతున్నాయని చెప్పారు. ఒమైక్రాన్ కారణంగా ఇప్పటివరకూ మరణాలు సంభవించలేదన్నారు. కేంద్రం ఇప్పటివరకూ వివిధ రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు 142 కోట్ల 73 లక్షలకు పైగా వ్యాక్సిన్ డోసులు అందించింది. రాష్ట్రాల వద్ద ఇంకా 16 కోట్ల 66 లక్షల డోసులు నిల్వ ఉన్నాయి. వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా భారత్లో ఇప్పటి వరకు 136 కోట్ల డోసులు వేశారు. గత 24 గంటల్లో 7,886 మంది కోలుకోవడంతో జాతీయ రికవరీ రేటు 98.38 శాతానికి చేరుకుంది.