ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు వరం : భాస్కర్రావు
ABN , First Publish Date - 2020-08-13T10:53:12+05:30 IST
ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు వరం లాంటిదని ఎమ్మెల్యే భాస్కర్రావు అన్నారు
మిర్యాలగూడ, ఆగస్టు 12 : ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు వరం లాంటిదని ఎమ్మెల్యే భాస్కర్రావు అన్నారు. బుధవారం ఆయన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ మొత్తం 76మంది లబ్ధిదారులకు రూ.25,41,500 చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మునిసిపల్ చైర్మన్ భార్గవ్, వైస్ చైర్మన్ విష్ణు, ఎంపీపీలు నూకల సరళాహన్మంతరెడ్డి, నందిని రవితేజ, జడ్పీటీసీ విజయసింహారెడ్డి, లలితా హతీరాం, వైస్ ఎంపీపీ సైదులు పాల్గొన్నారు.