అటవీ హక్కుల చట్టాన్ని ప్రభుత్వం అమలు చేయడం లేదు: భట్టి
ABN , First Publish Date - 2021-10-05T20:00:50+05:30 IST
అటవీ హక్కుల చట్టాన్ని తెలంగాణ ప్రభుత్వం అమలు చేయడం లేదని భట్టి విక్రమార్క విమర్శించారు.
హైదరాబాద్: అడవులలో ఉన్నవారు ఆత్మగౌరవం బతకాలని కాంగ్రెస్ అటవీ హక్కుల చట్టాన్ని తెచ్చిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. మంగళవారం అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ అటవీ హక్కుల చట్టాన్ని తెలంగాణ ప్రభుత్వం అమలు చేయడం లేదని, పైగా వారి నుంచి భూములు లాక్కుంటున్నారని విమర్శించారు. ఆ సమస్యను పరిష్కరిస్తానని చెప్పిన సీఎం కేసీఆర్ పట్టించుకోవడం లేదన్నారు. హక్కులు అడిగితే కొట్టడం, అరెస్ట్ చేయడం ఆనవాయితీగా మారిందని విమర్శించారు. అడవి బిడ్డలపై అకృత్యాలు పెరిగాయన్నారు. అటవీ హక్కుల చట్టంపై చర్చించాలని తామిచ్చిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరించడం అన్యాయమని భట్టి అన్నారు.