భవనానికి స్థలం మంజూరు చేయాలి
ABN , First Publish Date - 2021-06-22T06:43:07+05:30 IST
ఎర్రగొండపాలెంలో నాల్గో తరగతి ఉద్యో గు ల అసోసియేషన్ భవన నిర్మాణానికి ప్రభుత్వ స్థలంలో అనుమతి ఇవ్వాలని కలెక్టరు ప్రవీణ్కుమార్ను నాల్గో తరగతి ఉద్యోగులు అసోసియేషన్ నాయకులు కోరారు.
కలెక్టర్కు నాల్గో తరగతి ఉద్యోగుల సంఘం వినతి
ఎర్రగొండపాలెం, జూన్ 21 : ఎర్రగొండపాలెంలో నాల్గో తరగతి ఉద్యో గు ల అసోసియేషన్ భవన నిర్మాణానికి ప్రభుత్వ స్థలంలో అనుమతి ఇవ్వాలని కలెక్టరు ప్రవీణ్కుమార్ను నాల్గో తరగతి ఉద్యోగులు అసోసియేషన్ నాయకులు కోరారు. ఒంగోలులోని కలెక్టర్ చాంబర్లో సోమవారం ఆయన్ని కలిసి వినతిపత్రం అందజేశారు. ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు కోమటి వెంకటేశ్వర్లు కలెక్టర్ దృష్టికి పలు సమస్యలను తీసుకెళ్లారు. ఎర్రగొండపాలెంలో కొత్తగా ఏర్పాటైన ఆర్టీసీ బస్టాండు నిర్మాణానికి గతంలో ఉన్న అసోసియేషన్ భవనం కూల్చివేశారని ఫిర్యాదు చేశారు. బస్టాండు పక్కనే ఉన్న ప్ర భుత్వ స్థలంలో భవన నిర్మాణానికి అనుమతి మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశా రు. కలెక్టరు సానుకూలంగా స్పందించారని అధ్యక్షుడు ఆలేటి నాగయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు మండ్ల వెంకటసుబ్బయ్య పాల్గొన్నారు.