నేడు ఇంద్రకీలాద్రిలో భవానీ దీక్ష విరమణలు
ABN , First Publish Date - 2021-12-26T14:16:20+05:30 IST
నేడు ఇంద్రకీలాద్రి ఆలయంలో భవానీ భక్తులు దీక్ష విరమణలు చేయనున్నారు. ఆలయానికి భవానీ భక్తులు పెద్దఎత్తున తరలివస్తున్నారు.
విజయవాడ: నేడు ఇంద్రకీలాద్రి ఆలయంలో భవానీ భక్తులు దీక్ష విరమణలు చేయనున్నారు. ఆలయానికి భవానీ భక్తులు పెద్దఎత్తున తరలివస్తున్నారు. కాగా ఆలయ అధికారులు భవానీలకు వసతి ఏర్పాట్లను కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యారు. ఆలయానికి సంబంధించిన కాటేజీలు, గదులు లేకపోవడంతో పిల్లలతో రోడ్లపైనే భవానీ భక్తులు నిరీక్షించాల్సి వస్తోంది. ఏర్పాట్లు చేయకపొవడంతో ఆలయ అధికారులపై భవానీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.