నేడు కొండకల్‌లో రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీకి భూమిపూజ

ABN , First Publish Date - 2020-08-13T09:59:27+05:30 IST

శంకర్‌పల్లి మండలం కొండకల్‌ గ్రామంలో రైల్వే కొచ్‌ ఫ్యాక్టరీ నిర్మాణానికి భూమిపూజ జరుగుతుం దని, శంకర్‌పల్లి ఎంపీడీవో సత్తయ్య తెలిపారు

నేడు కొండకల్‌లో రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీకి భూమిపూజ

హాజరుకానున్న మంత్రులు కేటీఆర్‌, హరీష్‌రావు, సబితారెడ్డి


శంకర్‌పల్లి : శంకర్‌పల్లి మండలం కొండకల్‌ గ్రామంలో రైల్వే కొచ్‌ ఫ్యాక్టరీ నిర్మాణానికి భూమిపూజ జరుగుతుం దని, శంకర్‌పల్లి ఎంపీడీవో సత్తయ్య తెలిపారు. బుధవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఉదయం 10గంటలకు ప్రారంభ మయ్యే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌,  ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌ రావు, విద్యా శాఖ మంత్రి సబితారెడ్డి, ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య, ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, జడ్పీ చైర్‌పర్సన్‌ అనితారెడ్డి హాజరుకానున్నారని చెప్పారు. అయితే రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ స్థలం వద్ద సభ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలిపారు. సంబంధిత శాఖ అధికారులు, ప్రజాప్రతి నిధులు సకాలంలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. 

Updated Date - 2020-08-13T09:59:27+05:30 IST