భూపాలపల్లిలో మహిళ మృతి... వ్యాక్సిన్ వల్లే అంటూ ఆరోపణ
ABN , First Publish Date - 2021-12-29T13:55:30+05:30 IST
జిల్లాలోని మహదేవపూర్ మండలం ఎడపెల్లిలో రాపెల్లి సరోజన అనే మహిళ మృతి చెందింది.
భూపాలపల్లి: జిల్లాలోని మహదేవపూర్ మండలం ఎడపెల్లిలో రాపెల్లి సరోజన అనే మహిళ మృతి చెందింది. రెండు రోజుల క్రితం కరోనా వ్యాక్సిన్ తీసుకున్న బలవంతంగా ఇవ్వడం వల్లే చనిపోయిందని బంధువులు ఆరోపిస్తున్నారు. బలవంతంగా వ్యాక్సిన్ వేయించి చంపేశారని ఎంపీపీ రాణిబాయ్పై బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వ్యాక్సిన్ ఇస్తుండగా.. తనకు ఆరోగ్యం బాగాలేదని వ్యాక్సిన్ వద్దని మృతురాలు వారించింది. అయినప్పటికీ వ్యాక్సిన్ ఇవ్వగా... రెండు రోజుల్లో తీవ్ర జ్వరంతో సరోజ మృతి చెందింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.