భూపాలపల్లి ఏరియాలో సమ్మె ప్రశాంతం
ABN , First Publish Date - 2020-07-02T15:49:33+05:30 IST
భూపాలపల్లి ఏరియాలో సమ్మె ప్రశాంతం
భూపాలపల్లి: బొగ్గు గనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జాతీయ సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు భూపాలపల్లి ఏరియాలో సమ్మె ప్రశాంతంగా జరిగింది. ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, సీఐటీయూ, హెచ్ఎంఎస్ నాయకులు కొరిమి రాజ్ కుమార్, బుచ్చయ్య రాజయ్య, పసునూరి రాజేందర్లు జీఎం కార్యాలయం ముందు నిరసన తెలిపారు. వీరికి ఏఐఎఫ్బీ రాష్ట్ర నాయకులు గంట సత్యనారాయణరావు మద్దతు తెలిపారు. కార్మికుల సమ్మెతో ఏరియాలోని అన్ని గనులు మూతపడ్డాయి. టీబీజీకేఎస్ కూడా సమ్మెలో పాల్గొంది.