బైడెన్ ప్రభుత్వంలో మరో నలుగురు భారతీయ అమెరికన్లకు చోటు!

ABN , First Publish Date - 2021-01-26T02:08:37+05:30 IST

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రభుత్వంలో మరో నలుగురు ఇండియన్ అమెరికన్లకు చోటు దక్కింది. ఇం

బైడెన్ ప్రభుత్వంలో మరో నలుగురు భారతీయ అమెరికన్లకు చోటు!

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రభుత్వంలో మరో నలుగురు ఇండియన్ అమెరికన్లకు చోటు దక్కింది. ఇంధనశాఖలో నలుగురు ఇండియన్ అమెరికన్లకు కీలక పదవులను కేటాయిస్తూ బైడెన్ అడ్మినిస్ట్రేషన్ ఉత్తర్వులు జారీ చేసింది. తారక్ షా‌ను చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా నియమించింది. ఆఫీస్ సైన్స్‌లో చీఫ్ ఆఫ్ స్టాఫ్ పదవిని తన్యా దాస్‌కు  కేటాయించింది. అదే విధంగా నారాయణ్ సుబ్రహ్మణియన్‌ను ఆఫీస్ ఆఫ్ జనరల్ కౌన్సిల్‌లో న్యాయ సలహాదారుగా.. షుచి తలతి ఫాజిల్‌ను ఎనర్జీ విభాగంలో చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా నియమించింది. కాగా.. ఇంధనశాఖలో చీఫ్ ఆఫ్ స్టాఫ్‌ పదవిని చేపట్టనున్న మొదటి ఇండియన్ అమెరికన్‌ తారక్ షాకు గుర్తింపు లభించింది. 


Updated Date - 2021-01-26T02:08:37+05:30 IST