‘డస్క్ ఫాల్ పిజ్జా’ను ప్రారంభించిన బిగ్‌బాస్ ఫేమ్ లహరి

ABN , First Publish Date - 2021-10-25T00:47:00+05:30 IST

బిగ్‌బాస్ సీజన్ 5 ఫేమ్ లహరి శరి మధురానగర్‌లో సందడి చేశారు. హైదరాబాద్‌కు చెందిన ఎన్ఆర్ఐలు మహేశ్, లక్ష్మీ ఉప్పులూరి ఆహార పరిశ్రమపట్ల మక్కువతో ‘డస్క్ ఫాల్ పిజ్జా’ పేరుతో పిజ్జా స్టోర్‌ను ఏర్పాటు చేశారు.

‘డస్క్ ఫాల్ పిజ్జా’ను ప్రారంభించిన బిగ్‌బాస్ ఫేమ్ లహరి

హైదరాబాద్: బిగ్‌బాస్ సీజన్ 5 ఫేమ్ లహరి శరి మధురానగర్‌లో సందడి చేశారు. హైదరాబాద్‌కు చెందిన ఎన్ఆర్ఐలు మహేశ్, లక్ష్మీ ఉప్పులూరి ఆహార పరిశ్రమపట్ల మక్కువతో ‘డస్క్ ఫాల్ పిజ్జా’ పేరుతో పిజ్జా స్టోర్‌ను ఏర్పాటు చేశారు. ఈ స్టోర్‌ను లహరి శరి ప్రారంభించారు. ఈ సందర్భంగా లహరి మాట్లాడుతూ.. ఈ స్టోర్‌లో స్నాక్స్, పిజ్జాలు మొదలైనవాటిని అందిస్తున్నారని, తాను వాటన్నిటినీ రుచి చూడాలనుకుంటున్నాని చెప్పారు. సినిమాల గురించి మాట్లాడుతూ.. ప్రస్తుతం తాను నాలుగు తెలుగు చిత్రాల్లో నటిస్తున్నట్లు తెలిపారు. ఇక నిర్వాహకులు మహేశ్ ఉప్పలూరి మాట్లాడుతూ.. తమ స్టోర్‌లో వెజ్ బర్గర్లు, చికెన్ బర్గర్లు, వెజ్ పిజ్జాలు, చికెన్ పిజ్జాలు, మాక్ టెయిల్స్, ఐస్ క్రీమ్ లు, చికెన్ వింగ్స్, వెజ్ మరియు చికెన్ నగ్గెట్స్ మరియు శాండ్ విచ్ లు అందుబాటులో ఉన్నాయన్నారు. 

Updated Date - 2021-10-25T00:47:00+05:30 IST