బీహార్లో మరోమారు పూర్తిస్థాయి లాక్డౌన్
ABN , First Publish Date - 2020-07-14T12:18:27+05:30 IST
బీహార్ మరోమారు పూర్తిస్థాయి లాక్డౌన్ కోసం సిద్ధమవుతోంది. ఇందుకోసం నితీష్ ప్రభుత్వం ఈరోజు ఉన్నతాధికారులతో సమావేశాన్ని నిర్వహించనుంది.
పట్నా: బీహార్ మరోమారు పూర్తిస్థాయి లాక్డౌన్ కోసం సిద్ధమవుతోంది. ఇందుకోసం నితీష్ ప్రభుత్వం ఈరోజు ఉన్నతాధికారులతో సమావేశాన్ని నిర్వహించనుంది. ఈ సమావేశంలో రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కేసుల కట్టడి గురించి సమీక్షించనున్నారు. ఈ సందర్భంగా బీహార్ ప్రధాన కార్యదర్శి దీపక్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయి లాక్డౌన్ విధించే దిశగా ఆలోచిస్తున్నదని అన్నారు. బీహార్లో కరోనా కేసులు అత్యధికంగా నమోదవుతున్నాయి. రాష్ట్రంలోని మొత్తం 38 జిల్లాల్లో కొత్తగా 1,116 కరోనా ఇన్ఫెక్షన్లను గుర్తించినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 17,421 కు పెరిగింది. అదేవిధంగా ఒక వైద్యుడు కూడా కరోనా కారణంగా మృతిచెందారు. 54 ఏళ్ల డాక్టర్ అశ్వని నందకులియార్ పట్నాలోని ఎయిమ్స్లో కన్నుమూశారు. అలాగే మరో 9 మంది కరోనా బాధితులు కూడా మృతి చెందారు.