సకాలంలోనే బీహార్ ఎన్నికలు నిర్వహిస్తాం...సీఈసీ వెల్లడి

ABN , First Publish Date - 2020-08-11T16:22:44+05:30 IST

కరోనా సంక్షోభం నెలకొన్నా బీహార్ అసెంబ్లీ ఎన్నికలు సకాలంలోనే నిర్వహిస్తామని కేంద్ర ఎన్నికల కమిషన్ ముఖ్య ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరా స్పష్టం చేశారు.....

సకాలంలోనే బీహార్ ఎన్నికలు నిర్వహిస్తాం...సీఈసీ వెల్లడి

న్యూఢిల్లీ : కరోనా సంక్షోభం నెలకొన్నా బీహార్ అసెంబ్లీ ఎన్నికలు సకాలంలోనే నిర్వహిస్తామని కేంద్ర ఎన్నికల కమిషన్ ముఖ్య ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరా స్పష్టం చేశారు. కరోనా సంక్షోభం వల్ల బీహార్ అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేయాలని పలు రాజకీయ పార్టీలు చేసిన డిమాండును చీఫ్ ఎలక్షన్ కమిషనర్ తోసిపుచ్చారు. కరోనా వ్యాప్తి చెందుతున్న వేళ తాము అన్ని రకాల ముందు జాగ్రత్తలు తీసుకొని ఎన్నికలు నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రీయ జనతాదళ్, లోక్ జనశక్తి పార్టీలు బీహార్ అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేయాలని కోరిన నేపథ్యలో ఈసీ ఈ ప్రకటన చేసింది. ప్రజల భద్రత ముఖ్యమని, ఈ పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించవద్దని కాంగ్రెస్ నాయకుడు అఖిలేష్ ప్రసాద్ సింగ్ కోరారు. బీహార్ ఎన్నికల నిర్వహణపై రాజకీయ పార్టీల అభిప్రాయాలు తీసుకునేందుకు మంగళవారం గడువు విధిస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది. నవంబరు 29వతేదీతో బీహార్ అసెంబ్లీ కాలపరిమితి ముగియనుంది.

Updated Date - 2020-08-11T16:22:44+05:30 IST