బాబోయ్.. ఇదేం కేసు.. రాత్రిళ్లు కలలోకి వచ్చి అత్యాచారం చేస్తున్నాడట.. కేసు పెట్టిన మహిళ

ABN , First Publish Date - 2021-06-25T01:34:49+05:30 IST

క్షుద్ర పూజలు చేసే ఓ వ్యక్తి తనపై కలలో తరచుగా అత్యాచారానికి పాల్పడుతున్నాడని బీహార్‌కు చెందిన ఓ మహిళ పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ ఇచ్చింది

బాబోయ్.. ఇదేం కేసు.. రాత్రిళ్లు కలలోకి వచ్చి అత్యాచారం చేస్తున్నాడట.. కేసు పెట్టిన మహిళ

ఓ మాంత్రికుడు తనపై కలలో తరచుగా అత్యాచారానికి పాల్పడుతున్నాడని బీహార్‌కు చెందిన ఓ మహిళ పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ ఇచ్చింది. బీహార్‌లోని గాంధీ మైదాన్ ప్రాంతానికి చెందిన ఓ మహిళ కుమారుడు గతేడాది చివర్లో తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో ఆమె ఈ ఏడాది జనవరిలో ప్రశాంత్ చతుర్వేది అనే మాంత్రికుడిని కలిసి తన కొడుకు అనారోగ్యం గురించి వివరించింది.


సదరు మాంత్రికుడు ఆ మహిళ కుమారుడు కోలుకునేందుకు కొన్ని పూజలు చేశాడు. అయితే ఆ తర్వాత 15 రోజులకే ఆమె కుమారుడు మరణించాడు. దీంతో ఆమె చతుర్వేది ఇంటి వద్దకు వెళ్లి నిలదీసింది. ఆ సమయంలో చతుర్వేది తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని, అప్పుడు తన కుమారుడు వచ్చి రక్షించాడని,  ఆ తర్వాత చతుర్వేది పలుసార్లు కలలోకి వచ్చి తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఆ మహిళ స్థానిక కుద్వా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. 


ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు చతుర్వేదిని విచారించారు. అయితే ఆ మహిళను ఇప్పటివరకు తను ఒక్కసారి కూడా చూడలేదని చతుర్వేది పోలీసులకు చెప్పాడు. చతుర్వేదికి వ్యతిరేకంగా ఒక్క సాక్ష్యం కూడా లేకపోవడంతో బాండ్‌పై సంతకం చేయించుకుని పోలీసులు అతడిని వదిలేశారు.  


Updated Date - 2021-06-25T01:34:49+05:30 IST