బిజిగిరి షరీఫ్ రైల్వేస్టేషన్లో మంటలు.. యంత్రాలు దగ్ధం
ABN , First Publish Date - 2020-10-22T04:24:36+05:30 IST
బిసుగిర్ షరీఫ్ రైల్వేస్టేషన్లో మంటలు చెలరేగాయి. రైల్వే స్టేషన్లో కొత్తగా నిర్మించిన భవనంలో యంత్రాలు దగ్ధమయ్యాయి. జమ్మికుంట- పోత్కపల్లి మధ్య బిసుగిర్ షరీఫ్ రైల్వే స్టేషన్ ఉంది..
కరీంనగర్: బిసుగిర్ షరీఫ్ రైల్వేస్టేషన్లో మంటలు చెలరేగాయి. రైల్వే స్టేషన్లో కొత్తగా నిర్మించిన భవనంలో యంత్రాలు దగ్ధమయ్యాయి. జమ్మికుంట- పోత్కపల్లి మధ్య బిసుగిర్ షరీఫ్ రైల్వే స్టేషన్ ఉంది. జమ్మికుంట సీఐ సృజన్రెడ్డికి బిసుగిర్ షరీఫ్ వార్డ్ మెంబర్ ఫక్రుద్దీన్ సమాచారమిచ్చారు. సీఐ సృజన్రెడ్డి ఫైర్ ఇంజన్ పంపించారు. మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.