మోటార్‌సైకిల్‌ను ఢీకొన్న లారీ

ABN , First Publish Date - 2021-06-21T08:11:51+05:30 IST

పిఠాపురం పట్టణ శివారులోని ఆర్వోబీవద్ద ఆది వారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో భర్త మరణించగా, భార్యకు గా యాలయ్యాయి. కాకినాడ అశోక్‌నగర్‌కు చెందిన ఏ.మాణిక్యం తన భార్య వెంకటలక్ష్మితో కలిసి మోటార్‌సైకిల్‌పై పిఠాపురంలోని అత్తవారింటికి బయలుదేరారు.

మోటార్‌సైకిల్‌ను ఢీకొన్న లారీ

భర్త మృతి, భార్యకు గాయాలు

పిఠాపురం, జూన్‌ 20: పిఠాపురం పట్టణ శివారులోని ఆర్వోబీవద్ద ఆది వారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో భర్త మరణించగా, భార్యకు గా యాలయ్యాయి. కాకినాడ అశోక్‌నగర్‌కు చెందిన ఏ.మాణిక్యం తన భార్య వెంకటలక్ష్మితో కలిసి మోటార్‌సైకిల్‌పై పిఠాపురంలోని అత్తవారింటికి బయలుదేరారు. చిత్రాడ దాటిని తర్వాత ఫ్లైఓవర్‌ వద్దకు వచ్చేసరికి కత్తిపూడినుంచి కాకినాడ వెళ్తు న్న ధాన్యం లోడు లారీ ఢీకొట్టింది. మోటార్‌సైకిల్‌ లారీ టైర్లు కిందకు వెళ్లిపోవడంతో మాణిక్యం(50) అక్కడికక్కడే మరణించగా భార్య వెంకటలక్ష్మికి గాయాలయ్యాయి. ఆమెను చికిత్స నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పిఠాపురం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-06-21T08:11:51+05:30 IST