ద్విచక్రవాహనాల ఢీ : వ్యాపారి మృతి

ABN , First Publish Date - 2020-11-23T06:31:48+05:30 IST

రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.

ద్విచక్రవాహనాల ఢీ : వ్యాపారి మృతి
సుబ్రహ్మణ్యం (ఫైల్‌ ఫొటో)

కలికిరి, నవంబరు 22: రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఆదివారం కలికిరి శివార్లలోని పొట్టేకులవారిపల్లె సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. కలికిరి  ఏఎన్‌ఆర్‌ కాలనీకి చెందిన ఏ-1 షామియానా డెకొరేటర్స్‌ యజమాని సుబ్రహ్మణ్యం (52) దిగువకంభంవారిపల్లెలో పని ముగించుకుని తిరుగు ప్రయాణంలో ద్విచక్ర వాహనంపై కలికిరికి వస్తుండగా డీకే వారిపల్లె క్రాస్‌ వద్ద ఎదురుగా వచ్చిన మరో ద్విచక్ర వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో సుబ్రహ్మణ్యం అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ద్విచక్ర వాహనదారుడు సోమల మండలం వలిగట్ల ముడివారిపల్లెకు చెందిన మల్లికార్జున (29) తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని చికిత్స నిమిత్తం కలికిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తరలించారు. కాగా మృతుడు సుబ్రహ్మణ్యంకు భార్య, ఇద్దరు కుమారులున్నారు. తీవ్రంగా గాయపడ్డ మల్లికార్జున తన సోదరుడి వివాహ ఆహ్వాన పత్రికలు పంపిణీ చేసే పని మీద వెళ్ళి తిరుగు ప్రయాణంలో ప్రమాదానికి గురయ్యాడు. కలికిరి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


Updated Date - 2020-11-23T06:31:48+05:30 IST