యూటర్న్‌ తీసుకుంటుండగా బైక్‌ను ఢీ కొట్టిన కారు

ABN , First Publish Date - 2020-08-12T20:52:34+05:30 IST

ఎన్‌హెచ్‌-44పై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది. యూటర్న్‌ తీసుకుంటున్న ద్విచక్ర వాహనాన్ని కారు ఢీ కొనడంతో, ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.

యూటర్న్‌ తీసుకుంటుండగా బైక్‌ను ఢీ కొట్టిన కారు

ఎన్‌హెచ్‌-44పై ఘోర ప్రమాదం

సంఘటనా స్థలంలో ఇద్దరి దుర్మరణం 

మరొకరి పరిస్థితి విషమం


జడ్చర్ల(మహబూబ్ నగర్) : ఎన్‌హెచ్‌-44పై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది. యూటర్న్‌ తీసుకుంటున్న ద్విచక్ర వాహనాన్ని కారు ఢీ కొనడంతో, ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్లలోని వాల్మీకినగర్‌కు చెందిన కావలి శేఖర్‌(42), అతని స్నేహితులు బాదేపల్లికి చెందిన ఎడ్ల శ్రీనివాస్‌గౌడ్‌ (45), శాంతినగర్‌ కాలనీకి చెందిన వట్టెపు రాజు (32)లు మంగళవారం ఉదయం ద్విచక్ర వాహ నంపై మండలంలోని మల్లెబోయిన్‌పల్లి నుంచి జడ్చర్లకు బయల్దేరారు. మార్గమధ్యలో జాతీయ రహదారి మీదుగా బురెడ్డిపల్లి గ్రామ స్టేజీ వ ద్ద యూ టర్న్‌ తీసుకుంటుండగా, హైదరాబాద్‌ నుంచి కర్నూల్‌ వైపు వెళ్తున్న కారు వచ్చి ఢీ కొట్టింది. ప్రమాదంలో శేఖర్‌, శ్రీని వాస్‌గౌడ్‌ అక్కడికక్కడే మృతి చెందారు. రాజుకు తీవ్ర గా యాలు కాగా, 108లో జిల్లా జనరల్‌ ఆసుపత్రికి తర లించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో, హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలాన్ని సీఐ వీరస్వామి పరిశీలించి, మృతదేహలను పోస్టుమా ర్టానికి తరలించారు. కావలి పద్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.

Updated Date - 2020-08-12T20:52:34+05:30 IST