బైకు, కారు ఢీ.. ఏఆర్ ఏఎస్సై దుర్మరణం
ABN , First Publish Date - 2021-11-28T05:08:03+05:30 IST
విధులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా జడ్చర్ల హౌసింగ్బోర్డు కాలనీ సమీపంలో మహబూబ్నగర్ వెళ్లే దారిలో బైకు, కారు ఢీకొన్న సంఘటనలో ఏఆర్ ఏఎస్సై అనంత రాము(54) మృతి చెందాడు.
- విధులు ముగించుకొని ఇంటికి వెళ్తుండగా సంఘటన
జడ్చర్ల, నవంబరు 27 : విధులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా జడ్చర్ల హౌసింగ్బోర్డు కాలనీ సమీపంలో మహబూబ్నగర్ వెళ్లే దారిలో బైకు, కారు ఢీకొన్న సంఘటనలో ఏఆర్ ఏఎస్సై అనంత రాము(54) మృతి చెందాడు. జడ్చర్ల సీఐ రమేశ్బాబు తెలిపిన వివ రాల మేరకు.. జడ్చర్ల మండలం శంకరాయపల్లి గ్రామానికి చెందిన ఆంగోతు అనంతరాము నాగర్కర్నూల్ జిల్లాలో ఏఆర్ ఏఎస్సైగా విధులు నిర్వహిస్తున్నారు. విధులు ముగించుకొని శనివారం ఉద యం ద్విచక్ర వాహనంపై శంకరాయపల్లికి (ఇంటికి) బయలుదేరాడు. జడ్చర్ల హౌసింగ్బోర్డు కాలనీ సమీపంలో గ్రానైట్ దుకాణం సమీపంలో వెనకనుంచి వచ్చిన కారు ఢీ కొట్టింది. ప్రమాదంలో అనంతరాము తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే చికిత్స కోసం జిల్లా జనరల్ ఆసుపత్రికి తీసు కెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అనంతరాము కుమారుడు రాజ్కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు సీఐ తెలిపారు.