బైకు అదుపుతప్పి యువకుడికి గాయాలు
ABN , First Publish Date - 2021-01-16T06:03:50+05:30 IST
వేగంగా వెళుతున్న బైకు అదుపుతప్పడంతో యువకుడికి గాయాలైన ఘటన శ్రీనివాసనగర్ వద్ద జరి గింది.
త్రిపురాంతకం, జనవరి 15 : వేగంగా వెళుతున్న బైకు అదుపుతప్పడంతో యువకుడికి గాయాలైన ఘటన శ్రీనివాసనగర్ వద్ద జరి గింది. విశ్వనాథపురం గ్రామానికి చెందిన ఎనిబెర దినేష్ బైకుపై త్రిపురాంతకం నుంచి స్వగ్రామానికి వెళుతున్నాడు. మార్గమధ్యలో శ్రీనివాసనగర్ వద్ద బైకు అదుపుతప్పి పడిపోయాడు. ఈ ప్రమాదంలో దినేష్ తలకు తీవ్రగాయాలయ్యాయి. ప్రైవేటు వాహనంలో దినేష్ను త్రిపురాంతకం వైద్యశాలకు తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం క్షతగాత్రుడిని గుంటూరుకు తరలించారు.