ఇంటి ముందు పార్క్ చేసిన బైక్ దహనం
ABN , First Publish Date - 2020-12-28T12:17:48+05:30 IST
ఇంటి ముందు పార్క్ చేసిన బైక్ను గుర్తుతెలియని
హైదరాబాద్/జీడిమెట్ల : ఇంటి ముందు పార్క్ చేసిన బైక్ను గుర్తుతెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి తగులబెట్టారు. సంజయ్గాంధీనగర్కు చెందిన కొల్లి ఉమేష్(27) తన బైక్ను శనివారం రాత్రి ఇంటి ముందు పార్క్ చేసి నిద్రపోయాడు. ఆదివారం ఉదయం లేచి చూడగా బైక్ కాలిపోయి ఉంది. బాధితుడి ఫిర్యాదు మేరకు జీడిమెట్ల పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.