పర్మినెంట్ అన్నావు.... ఏం చేశావు?
ABN , First Publish Date - 2021-06-19T05:03:15+05:30 IST
అధికారంలోకి రాగానే పర్మినెంట్ చేస్తానన్నావు.... సమాన పనికి సమాన వేతనమని చెప్పావు... సీఎం అయ్యి రెండేళ్లు పూర్తవుతున్నా ఏం చేశా వు? అంటూ నగర పాలక సంస్థలోని బిల్లు కలెక్టర్లు ముఖ్యమంత్రి జగన్పై మండిపడ్డారు.
రాష్ట్ర ప్రభుత్వంపై బిల్లు కలెక్టర్ల మండిపాటు
నెల్లూరు (సిటీ), జూన్ 18 : అధికారంలోకి రాగానే పర్మినెంట్ చేస్తానన్నావు.... సమాన పనికి సమాన వేతనమని చెప్పావు... సీఎం అయ్యి రెండేళ్లు పూర్తవుతున్నా ఏం చేశా వు? అంటూ నగర పాలక సంస్థలోని బిల్లు కలెక్టర్లు ముఖ్యమంత్రి జగన్పై మండిపడ్డారు. ఈ మేరకు శుక్రవారం కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. 2013లో కార్పొరేషన్లో విలీనమైన పంచాయతీల్లో పని చేస్తున్న తమను అధికారంలోకి రాగానే పర్మినెంట్ చేసి, సమాన పనికి సమాన వేతనం ఇస్తానన్న హామీని విస్మరించారని విమర్శించారు. ఇప్పటికైనా తమను పర్మినెంట్ చేసి ఇతర సౌకర్యాలు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మహేంద్రబాబు, టీ వెంకయ్య, సుధీర్, ఏ వెంకటేశ్వర్లు, సభాపతి తదితరులు పాల్గొన్నారు.