మోదీకి కృతజ్ఞతలు తెలుపుతూ కెనడాలో వెలిసిన భారీ బిల్‌బోర్డులు

ABN , First Publish Date - 2021-03-11T21:04:45+05:30 IST

కెనడా వీధుల్లో ప్రధాని నరేంద్ర మోదీతో ఫొటోతో కూడిన భారీ బిల్‌బోర్డులు వెలిశాయి. కొవిడ్ వ్యాక్సిన్‌ను తమ దేశానికి అందించినందుకు భారతదేశానికి, ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలుపుతూ గ్రేటర్ టొరెం

మోదీకి కృతజ్ఞతలు తెలుపుతూ కెనడాలో వెలిసిన భారీ బిల్‌బోర్డులు

టొరెంటో: కెనడా వీధుల్లో ప్రధాని నరేంద్ర మోదీతో ఫొటోతో కూడిన భారీ బిల్‌బోర్డులు వెలిశాయి. కొవిడ్ వ్యాక్సిన్‌ను తమ దేశానికి అందించినందుకు భారతదేశానికి, ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలుపుతూ గ్రేటర్ టొరెంటోలో కొందరు ఈ బిల్‌బోర్డులను ఏర్పాటు చేశారు. ‘కెనడాకు కొవిడ్ వ్యాక్సిన్‌ను అందించినందుకు భారత్ మరియు పీఎం నరేంద్రమోదీకి కృతజ్ఞతలు. కెనడా, భారత్‌ల మధ్య స్నేహం ఇలానే కొనసాగాలి’ అని బిల్‌బోర్డులపై పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ బిల్‌బోర్డులను సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా.. గత వారం 5లక్షల డోసుల మేడిన్ ఇండియా కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ను కెనడాకు భారత్ అందించిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు 50కిపైగా దేశాలకు భారత్.. వ్యాక్సిన్‌ను అందించింది. మరన్ని దేశాలకు కూడా వ్యాక్సిన్ అందించేందుకు భారత్ సిద్ధంగా ఉందని ప్రధాని నరేంద్రమోదీ ఇటీవల ఓ కార్యక్రమంలో వెల్లడించారు. ఈ విషయంలో డబ్ల్యూహెచ్ఓ, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకులు బిల్‌గేట్స్ కూడా ఇటీవల భారత్‌ను అభినందించారు.  


Updated Date - 2021-03-11T21:04:45+05:30 IST