బిల్లులను వెంటనే మంజూరు చేయించాలి
ABN , First Publish Date - 2021-08-03T13:43:33+05:30 IST
తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో..
నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి డాక్టర్ అరవిందబాబు
నరసరావుపేట టౌన్: తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చేసిన పనులకు సీఎం వెంటనే బిల్లులు మంజూరు చేయించాలని టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ చదలవాడ అరవిందబాబు డిమాండ్ చేశారు. నరసరావుపేట మండల ప్రజా పరిషత్ అధికారి కార్యాలయంలో సోమవారం వినతిపత్రం అందజేశారు. డాక్టర్ అరవింద బాబు మాట్లాడుతూ తెలుగుదేశం హయాంలో చేసిన పనులు ఇప్పటి వరకు బిల్లులను చెల్లించకుండా కక్షపూరితంగా వైసీపీ ప్రభుత్వం వ్యవ హరిస్తుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది కాంట్రాక్టర్లు బిల్లులు రాక ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తీరు మార్చుకొని బిల్లులు వెంటనే చెల్లించాలని, లేదం టే ఉద్యమం రానున్న రోజులలో తీవ్రరూపం దాల్చుతుందని హెచ్చ రించారు. కార్యక్రమంలో నరసరావుపేట, రొంపిచర్ల టీడీపీ మండల అధ్యక్షులు బండారుపల్లి విశ్వేశ్వరరావు, వెన్న బాలకోటిరెడ్డి, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ పులిమి రామిరెడ్డి, మెట్టు వెంకటేశ్వరరెడ్డి, పార్లమెంట్ కార్యాలయ కార్యదర్శి గొట్టిపాటి జనార్దన్బాబు, పార్లమెంట్ తెలుగు యువత అధ్యక్షుడు కుమ్మేత కోటిరెడ్డి, జిల్లా రైతు నాయకుడు కడియం కోటి సుబ్బారావు, బ్రాహ్మణ సంఘటన రాష్ట్ర అధికార ప్రతినిధి గూడూరు శేఖర్, కొనకంచివారిపాలెం మాజీ సర ్పంచ్ పొనుగోటి సాంబశివరావు, మెడబలిమి నవీన్, ముచ్చు వీరయ్య, చల్లగుండ్ల హరికృష్ణ, నగూర్ తదితరులు పాల్గొన్నారు.