‘ఇది నీ సమయం.. ఆనందించు’
ABN , First Publish Date - 2021-08-09T04:47:49+05:30 IST
టోక్యో ఒలింపిక్స్లో భారత్కు ఏకైక స్వర్ణం అందించిన జావెలిన్ త్రో క్రీడాకారుడు నీరజ్ చోప్రాపై సర్వత్రా ప్రశంసల వర్షం..
టోక్యో ఒలింపిక్స్లో భారత్కు ఏకైక స్వర్ణం అందించిన జావెలిన్ త్రో క్రీడాకారుడు నీరజ్ చోప్రాపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. 130 కోట్ల మంది ప్రజలు నీరజ్ను ఆకాశానికెత్తేస్తున్నారు. ఈ క్రమంలోనే 2008 బీజింగ్ ఒలింపిక్స్లో దేశానికి స్వర్ణం తెచ్చిపెట్టిన షూటర్ అభినవ్ బింద్రా కూడా నీరజ్ను అభిందనించాడు. ‘ఈ సమయం నీదే. ఆనందంగా ఆస్వాదించు’ అని ట్వీట్ చేశాడు.
అంతకుముందు నీరజ్ ఓ ట్వీట్ చేశాడు. అందులో బింద్రాను ఉద్దేశిస్తూ.. ‘ఒలింపిక్స్లో బంగారు పతకం కొట్టి బింద్రా స్థాయికి చేరడం ఊహించనేలేదు. ఇది నిజంగా కలలా ఉంది’ అని ట్వీట్ చేశారు. కాగా.. ఒలింపిక్స్లో భారత్ తరపున అభినవ్ బింద్రా, నీరజ్ చోప్రాలు మాత్రమే పసిడి పతకాలు సాధించారు.