భద్రాచలం రామాలయం వద్ద వింత పక్షి
ABN , First Publish Date - 2020-11-30T17:41:58+05:30 IST
భద్రాద్రి రామాలయం వద్ద విచిత్ర ఘటన చోటు చేసుకుంది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: భద్రాద్రి రామాలయం వద్ద విచిత్ర ఘటన చోటు చేసుకుంది. ఆలయం సన్నిధిలో ఓ వింత పక్షి ప్రత్యక్షమైంది. రామాలయం పూర్వయాగ శాలవద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. పక్షి వింత ఆకారంగా ఉంది. దీంతో భక్తులు పక్షిని సెల్ఫోన్లో బంధించారు. ఎగరలేక బాగా నీరసించి ఉన్నట్టుగా కనిపించడంతో స్థానికులు పక్షికి ఆహారం పెట్టారు. కానీ అది ముట్టుకోలేదు. కళ్లు మూసుకుని ఉంది.