Birthday వేడుకల్లో విషాదం
ABN , First Publish Date - 2021-11-26T17:28:05+05:30 IST
స్నేహితురాలి జన్మదిన వేడుకలకు వెళ్లిన చిన్నారి నీటి ప్రమాదానికి గురై గల్లంతయ్యింది. పాపను కాపాడ డానికి వెళ్లిన యువకుడు మృతి చెందడం ఆ రెండు కుటుంబాలను విషాదంలో నింపింది. చెళ్లకెర
- నీటిలో చిన్నారి గల్లంతు
- కాపాడబోయి యువకుడు మృతి
చెళ్లకెర(బెంగళూరు): స్నేహితురాలి జన్మదిన వేడుకలకు వెళ్లిన చిన్నారి నీటి ప్రమాదానికి గురై గల్లంతయ్యింది. పాపను కాపాడ డానికి వెళ్లిన యువకుడు మృతి చెందడం ఆ రెండు కుటుంబాలను విషాదంలో నింపింది. చెళ్లకెర తాలూకాలోని హాలిగొండనహళ్ళి బ్యారేజీ నీటిలో మునిగి ఇద్దరు దుర్మరణం చెందిన ఘటన గురువారం చోటు చేసుకుంది. హాలిగొండనహళ్ళిబ్యారేజ్ దగ్గర స్నేహితురాలి పుట్టిన రోజు వేడుకలను జరుపుకుంటుండగా మనిషా(8) ఆటలు ఆడుతూ ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయింది. అమ్మాయిని రక్షించడానికి వెళ్ళిన మంజునాథ్(37)నీటిలో మునిగి మృతిచెందాడు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, గజఈతగాళ్ళు వెతకగా మంజునాథ మృతదేహం లభించింది. మనీషా ఆచూకీ మాత్రం లభించలేదు. ఈ సందర్బంగా తహశీల్దార్ రఘుమూర్తి, డీవైఎస్పీ శ్రీధర్, తిప్పేస్వామి, పరశురామపుర పీఎస్సై స్వాతి, అగ్నిమాపక అధికారి జయణ్ణ గ్రామస్థులు తదితరులు ఉన్నారు.