ప్రార్థనతోనే దేవుని దీవెనలు

ABN , First Publish Date - 2021-01-18T05:21:22+05:30 IST

ప్రార్థనలతోనే దేవుని దీవెనలు అందుతాయని గుంటూరు బిషప్‌ డాక్టర్‌ చిన్నాబత్తిని భాగ్యయ్య అన్నారు.

ప్రార్థనతోనే దేవుని దీవెనలు
మాట్లాడుతున్న బిషప్‌ డాక్టర్‌ చిన్నాబత్తిని భాగ్యయ్య

గుంటూరు బిషప్‌ డాక్టర్‌ చిన్నాబత్తిని భాగ్యయ్య

ఫిరంగిపురం, జనవరి 17: ప్రార్థనలతోనే దేవుని దీవెనలు అందుతాయని గుంటూరు బిషప్‌ డాక్టర్‌ చిన్నాబత్తిని భాగ్యయ్య అన్నారు. ఆదివారం మండలంలోని హౌస్‌గణేష్‌ గ్రామంలో ఆర్‌సీఎం కథోలిక సభ్యులు నూతనంగా నిర్మించిన సెయింట్‌ నికోలస్‌ దేవాలయాన్ని ఆయన ప్రారంభించారు. దివ్య పూజాబలి అనంతరం ప్రసంగిస్తూ  భక్తులు విశ్వాసాన్ని బాహాటంగా ప్రకటించటానికి దేవాలయం ఉపయోగపడుతుందన్నారు. పూర్ణ మనస్సుతో ఆరాధించి దేవుని దీవెనలు పొందాలన్నారు. అనంతరం పుల్లా ఇస్రాయేలు, రోజమ్మల ఆత్మీయ వేదికను ఆయన ఆశీర్వదించి ప్రారంభించారు. దేవాలయంలోని దేవుని స్వరూపాలను, మరియమాత స్వరూపాలను ఆయన ఆశీర్వదించి ప్రారంభించారు. పూజల్లో బాలయోగి చర్చి ఫాదర్‌ పామిశెట్టి బాలస్వామి, ముట్లూరు విచారణ గురువులు జోజిరెడ్డి, బిషప్‌ కార్యదర్శి బాల జోసెఫ్‌, గురువులు, కన్యకలు, గ్రామస్తులు పాల్గొన్నారు.  

Updated Date - 2021-01-18T05:21:22+05:30 IST