ఆఖరి అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ

ABN , First Publish Date - 2021-03-29T21:10:35+05:30 IST

బెంగాల్‌లోని గల్సీ (ఎస్సీ నియోజకవర్గం) నుంచి బికాస్ బిశ్వాస్‌ను బీజేపీ రంగంలోకి దింపింది. 4, 5, 6, 7 విడతల్లో జరగాల్సిన పోలింగ్ నామినేషన్ గడువు ఇంకా మిగిలే ఉంది. గల్సి అసెంబ్లీ నియోజకవర్గానికి

ఆఖరి అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆఖరి అభ్యర్థిని భారతీయ జనతా పార్టీ సోమవారం ప్రకటించింది. మొత్తం 294 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న పశ్చిమ బెంగాల్‌లో 293 అభ్యర్థులను కొద్ది రోజుల క్రితం వరకే ప్రకటించారు. ఇక 294వ అభ్యర్థిని కూడా ఖరారు చేయడంతో అభ్యర్థుల ఖరారు 100 శాతం పూర్తైంది.


బెంగాల్‌లోని గల్సీ (ఎస్సీ నియోజకవర్గం) నుంచి బికాస్ బిశ్వాస్‌ను బీజేపీ రంగంలోకి దింపింది. 4, 5, 6, 7 విడతల్లో జరగాల్సిన పోలింగ్ నామినేషన్ గడువు ఇంకా మిగిలే ఉంది. గల్సి అసెంబ్లీ నియోజకవర్గానికి 6వ విడతలో ఎన్నికలు జరగనున్నాయి. టీఎంసీ, కాంగ్రెస్-లెఫ్ట్ కూటమి పూర్తి అభ్యర్థులను కొద్ది రోజుల క్రితమే ప్రకటించాయి.


ఈ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశ పోలింగ్‌లో బెంగాలీలు పోటెత్తి ఓటేశారు. మొదటి దశ పోలింగ్‌లో 84.63 శాతం ఓటింగ్ నమోదైంది. మరో ఆరు దశల పోలింగ్ పూర్తైన తర్వాత మే 2న ఫలితాలు విడుదల కానున్నాయి.

Updated Date - 2021-03-29T21:10:35+05:30 IST