ఉద్యోగులకు ఫిట్ మెంట్ పేరుతో కేసీఆర్ కొత్త డ్రామా: బండి సంజయ్
ABN , First Publish Date - 2021-01-27T21:44:03+05:30 IST
ఉద్యోగులకు ఫిట్ మెంట్ పేరుతో కేసీఆర్ కొత్త డ్రామా: బండి సంజయ్
హైదరాబాద్: ఉద్యోగులకు ఫిట్ మెంట్ పేరుతో కేసీఆర్ కొత్త డ్రామాకు తెరలేపారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. మూడేళ్ల తర్వాత ఇప్పుడు బిశ్వాల్ కమిటీ రిపోర్ట్తో ఉసూరు మనిపించారని ఆవేదన వ్యక్తం చేశారు. అసలు బిశ్వాల్ కమిటీ పని చేసిందా.. కమిటీని స్వతంత్రంగా పని చేయనిచ్చారా అని ప్రశ్నించారు. 7.5 శాతం ఫిట్మెంట్ ఇచ్చేందుకు ఒక కమిటీ వేయలా అన్నారు. ఉద్యోగులను నమ్మించడానికే బిశ్వాల్ కమిటీ వేసి కమిటీపై ఒత్తిడి పెంచి రిపోర్ట్ రాయించారని పేర్కొన్నారు.