Rajagopal Reddy: బండి సంజయ్‌తో భేటీ.. మునుగోడులో పాదయాత్ర చేయాలని విజ్ఞప్తి

ABN , First Publish Date - 2022-08-10T04:17:49+05:30 IST

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ (Bandi sanjay) ను మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి (Rajagopal reddy) కలిశారు. అంకిరెడ్డిగూడెం దగ్గర పాదయాత్ర చేస్తుండగా....

Rajagopal Reddy: బండి సంజయ్‌తో భేటీ.. మునుగోడులో పాదయాత్ర చేయాలని విజ్ఞప్తి

యాదాద్రి: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ (Bandi sanjay)ను మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి (Rajagopal reddy) కలిశారు. అంకిరెడ్డిగూడెం దగ్గర పాదయాత్ర చేస్తుండగా రాజగోపాల్ రెడ్డి భేటీ అయ్యారు. రూట్‌మ్యాప్ మార్చుకుని మునుగోడు నియోజకవర్గంలో పాదయాత్ర నిర్వహించాలని కోరారు. ఈ సందర్బంగా రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ గుత్తా సుఖేందర్‌రెడ్డి (Gutha Sukendar Reddy) ఎన్ని పార్టీలు మారారో గుర్తుచేసుకోవాలన్నారు. గుత్తా ఎంపీ పదవికి రాజీనామా చేయకుండానే కండువా మార్చుకున్నారని రాజగోపాల్‌రెడ్డి ఎద్దేవా చేశారు. 

Updated Date - 2022-08-10T04:17:49+05:30 IST