కరీంనగర్లోనే బండి సంజయ్
ABN , First Publish Date - 2022-01-06T03:08:12+05:30 IST
కరీంనగర్ జైలు నుంచి బండి సంజయ్ విడుదలైన విషయం తెలిసిందే. అయితే ఆయన గురువారం కూడా కరీంనగర్లోనే ..
హైదరాబాద్: కరీంనగర్ జైలు నుంచి బండి సంజయ్ విడుదలైన విషయం తెలిసిందే. అయితే ఆయన గురువారం కూడా కరీంనగర్లోనే ఉండనున్నారు. 317 జీవోను సవరించాలని నిరసన చేపట్టనున్నారు. ఈ కార్యక్రమంలో ఛత్తీస్గఢ్ మాజీ సీఎం రమణ్సింగ్ పాల్గొననున్నారు. ఈ మేరకు రమణ్ సింగ్ కూడా గురువారం కరీంనగర్ రానున్నారు. నిరసన కార్యక్రమం తర్వాత శుక్రవారం బండి సంజయ్.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలవనున్నారు. ఆ తర్వాత బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించే వెల్కమ్ సభలో బండి సంజయ్ పాల్గొననున్నారు. ఈ సభకు మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్సింగ్ చౌహాన్ చీఫ్ గెస్ట్గా హాజరుకానున్నారు.