ఫిబ్రవరి 4న చలో డీజీపీ ఆఫీస్‌కు బీజేపీ పిలుపు

ABN , First Publish Date - 2022-01-30T00:29:55+05:30 IST

ఫిబ్రవరి 4న చలో డీజీపీ ఆఫీస్‌కు బీజేపీ పిలుపునిచ్చింది. బీజేపీ కార్యకర్తలపై దాడులను నిరసిస్తూ చలో డీజీపీ ఆఫీస్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు

ఫిబ్రవరి 4న చలో డీజీపీ ఆఫీస్‌కు బీజేపీ పిలుపు

హైదరాబాద్‌: ఫిబ్రవరి 4న చలో డీజీపీ ఆఫీస్‌కు బీజేపీ పిలుపునిచ్చింది. బీజేపీ కార్యకర్తలపై దాడులను నిరసిస్తూ చలో డీజీపీ ఆఫీస్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ నేతలు తెలిపారు. పార్టీ కార్యాలయం నుండి డీజీపీ ఆఫీస్‌ వరకు బీజేపీ నేతలు ర్యాలీ చేపట్టనున్నారు. పోలీసులు టీఆర్ఎస్‌కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ర్యాలీగా వెళ్లి డీజీపీ మహేందర్‌రెడ్డికి మెమోరాండం బీజేపీ నేతలు ఇవ్వనున్నారు.


అంతకుముందు సీఎం కేసీఆర్ డైరెక్షన్‌లోనే బీజేపీ నేతలపై దాడులు జరుగుతున్నాయని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు. ప్రజా సమస్యలను దారి మళ్లించేందుకే బీజేపీ నేతలపై దాడులు చేస్తున్నారని ఆయన అన్నారు. కేసీఆర్‌కు కొందరు పోలీసులు కొమ్ముకాస్తున్నారన్నారు. అరాచకాలు, కుట్రలతోనే ఎన్నికల్లో గెలవాలని కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. కేసీఆర్‌పై రైతులు తిరగబడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని సంజయ్ హెచ్చరించారు.

Updated Date - 2022-01-30T00:29:55+05:30 IST