తిరుపతి ఉప ఎన్నిక బరిలో బీజేపీ అభ్యర్థి

ABN , First Publish Date - 2021-03-13T00:15:23+05:30 IST

తిరుపతి ఎంపీ ఉప ఎన్నికల బరిలో బీజేపీ అభ్యర్థిని నిలబెడుతున్నట్లు ఆ పార్టీ నేత మురళీధరన్‌ ట్వీట్‌ చేశారు.

తిరుపతి ఉప ఎన్నిక బరిలో బీజేపీ అభ్యర్థి

అమరావతి: తిరుపతి ఎంపీ ఉప ఎన్నికల బరిలో బీజేపీ అభ్యర్థిని నిలబెడుతున్నట్లు ఆ పార్టీ నేత మురళీధరన్‌ ట్వీట్‌ చేశారు. జనసేన మద్దతుతో బీజేపీ అభ్యర్థి పోటీచేస్తారని ప్రకటించారు. జనసేనాని పవన్ కల్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కలిసే నిర్ణయం తీసుకున్నారని వెల్లడించారు. తిరుపతి నుంచి బీజేపీ విజయయాత్ర మొదలవుతుందని మురళీధరన్‌ ప్రకటించారు. గతంలో తిరుపతి ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థే పోటీ చేస్తారని సోము వీర్రాజు ప్రకటించి కలకలం రేపారు. మిత్రపక్షం జనసేన ఇచ్చిన షాక్‌తో బీజేపీ శ్రేణులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. తమను సంప్రదించకుండా ఏకపక్షంగా తిరుపతి ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి పోటీచేస్తారని ఎలా ప్రకటిస్తారని జనసైనికులు విరుచుకుపడ్డారు. తిరుపతిలో బీజేపీ అభ్యర్థి బరిలోకి దిగుతారని ఏకపక్షంగా ఎలా ప్రకటిస్తారని నిలదీశారు. బీజేపీ అభ్యర్థే బరిలో దిగుతారని ప్రకటించి.. ఈ వివాదానికి మురళీధరన్‌ పుల్‌స్టాప్ పెట్టారు.

Updated Date - 2021-03-13T00:15:23+05:30 IST