హామీలను అమలు చేయాలి
ABN , First Publish Date - 2021-03-08T05:49:16+05:30 IST
కేసీఆర్ ఉద్యోగులకు, నిరు ద్యోగులకు ఎన్నికలకు ముందు అనేక హామీలను ఇచ్చి నేటికి వాటిని నెరవేర్చకుండా వాగ్ధానా లను విస్మరించి పాలన సాగిస్తు న్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణ(చిన్ని) ఆరోపించారు.
బీజేపీ జిల్లా అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణ
జూలూరుపాడు, మార్చి 7: కేసీఆర్ ఉద్యోగులకు, నిరు ద్యోగులకు ఎన్నికలకు ముందు అనేక హామీలను ఇచ్చి నేటికి వాటిని నెరవేర్చకుండా వాగ్ధానా లను విస్మరించి పాలన సాగిస్తు న్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణ(చిన్ని) ఆరోపించారు. ఆదివారం మండ లంలోని వెంగన్నపాలెం గ్రామంలో ఆ పార్టీ జిల్లా నాయ కులు నున్నా రమేష్ స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ త్వరలో జరుగనున్న పట్టభద్రుల ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్ధిని ఓ డించాలని కోరారు. సోమవారం కొత్తగూడెం క్లబ్లో తమ పార్టీ ఆధ్వర్యంలో పట్ట భద్రుల ఆత్మీయ సమ్మేళ కా ర్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ కార్యక్ర మానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్ధి గుజ్జుల ప్రేమేందర్రెడ్డిలు పాల్గొంటారని పట్ట భద్రులు అధిక సంఖ్యలో హాజరై సమ్మేళనం కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని అన్నారు. టీఆర్ఎస్ పాలనపై అన్ని వర్గాల ప్రజలు, ఉద్యోగులు విసుగు చెందారని తెలిపారు. ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయకుండా నిరుద్యోగు లకు టీఆర్ఎస్ ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ హామీని కేసీఆర్ ప్రభుత్వం అమలు చేయలేదని విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎ్సను ఓడించడం ద్వారా గుణపాఠం చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. ఇందుకు కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. బీజేపీని గెలిపించి నట్లు అయితే నిరుద్యోగ, ఉపాధ్యాయ సమస్యలు పరిష్కా రం అవుతాయని తెలిపారు. ఈ సమావేశంలో బీజేపీ కిసాన్ మోర్చ రాష్ట్ర కార్యదర్శి చిలుకూరి రమేష్, పార్టీ జిల్లా కార్యదర్శి బెహరా, నాయకులు సీతారామరాజు, ను న్నా రమేష్, మాదినేని సతీష్, సిరిపురపు ప్రసాద్ , రాజేష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.